ప్రజల్ని కాపాడేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం
V6 Velugu Posted on May 22, 2021
న్యూఢిల్లీ: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రధాని మోడీని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఈ మేరకు నాలుగు సూచనలతో కూడిన ఓ లేఖను పీఎంకు కేజ్రీ పంపారు. మూడో వేవ్ ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడాంటే టీకా ప్రక్రియను పూర్తి చేయడం చాలా కీలకమని పేర్కొన్నారు.
కేజ్రీవాల్ చెప్పిన నాలుగు సూచనలు:
- కొవ్యాక్సిన్ ను రూపొందించిన భారత్ బయోటెక్ సంస్థ తమ ఫార్ములాను పంచుకోవడానికి సిధ్ధంగా ఉంది. కాబట్టి దేశంలో టీకాలు తయారు చేసే అన్ని కంపెనీలను కేంద్రం పిలవాలి. యుధ్ధ ప్రాతిపదికన వెంటనే వ్యాక్సిన్ తయారు చేయాలని ఆయా సంస్థలను ఆదేశించాలి.
- కరోనా టీకాలను తయారు చేస్తున్న విదేశీ కంపెనీతో 24 గంటల్లో వ్యాక్సిన్ తయారీని ప్రారంభించమని ఒప్పించాలి. విదేశాలతో మాట్లాడే బాధ్యతను కేంద్రమే తీసుకోవాలి.
- కొన్ని దేశాలు అవసరానికి మించి టీకాలను తమ దగ్గర పోగు చేసుకుంటున్నాయని తెలిసింది. అలాంటి దేశాలను ఒప్పించి మిగులు టీకాలను భారత్ కు రప్పించే ప్రయత్నం చేయాలి.
- వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న విదేశీ కంపెనీలకు మన దేశంలో టీకా తయారీకి వెంటనే అనుమతులు ఇవ్వాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.
कोरोना से लोगों की जान बचाने के लिए हमें कम से कम समय में ज़्यादा से ज़्यादा लोगों को वैक्सीन लगानी होगी और उसके लिए हमें देश में वैक्सीन की उपलब्धता तुरंत बढ़ानी होगी। इसके लिए केंद्र सरकार को मेरे चार सुझाव हैं - pic.twitter.com/dNoeDh1vvY
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 22, 2021
Tagged pm modi, India, Letter, Vaccination, Delhi CM Arvind Kejriwal, all states, vaccine production, Central Government, Foreign Countries