ఐటీ కారిడార్​లో కొత్తగా గ్రీన్​మైల్స్ క్యాంపెయి న్​ను స్టార్ట్

ఐటీ కారిడార్​లో కొత్తగా గ్రీన్​మైల్స్ క్యాంపెయి న్​ను స్టార్ట్
  • ఐటీ కారిడార్​లో నయా ట్రావెలింగ్ కాన్సెప్ట్
  • పొల్యూషన్, ట్రాఫిక్ జామ్ తగ్గించే  దిశగా ప్రయత్నాలు
  •  సొంత వెహికల్స్ వాడకుండా  పబ్లిక్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టులో వెళ్తున్న వారిని గుర్తించి అవార్డులు
  •  మెట్రోతో కలిసి ఐటీ కంపెనీల గ్రీన్ మైల్స్ క్యాంపెయిన్

హైదరాబాద్, వెలుగు: పొల్యూషన్ తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఐటీ కారిడార్​లో కొత్తగా గ్రీన్​మైల్స్ క్యాంపెయిన్​ను స్టార్ట్ చేశారు. సొంత వెహికల్స్ వాడకంతో ట్రాఫిక్ ​జామ్, పొల్యూషన్​ పెరుగుతుండటంతో.. ఈ సమస్యను తగ్గించి పబ్లిక్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టేషన్​ను ఉపయోగించేలా ఐటీ కంపెనీలు ఎంప్లాయీస్​ను ప్రోత్సహిస్తున్నాయి. హైదరాబాద్ మెట్రోతో కలిసి ఐటీ కంపెనీలు ఈ గ్రీన్ మైల్స్ క్యాంపెయిన్​ను మొదలుపెట్టాయి. మెట్రో, ఆర్టీసీ బస్సులు, కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూలింగ్(ఒకే వెహికల్​లో ఆఫీసుకు వెళ్లడం), బైక్ పూలింగ్​లో వచ్చే ఎంప్లాయీస్​ను గుర్తించి  వారికి అవార్డులు, బ్యాడ్జీలు అందించి ఎంకరేజ్ చేస్తున్నాయి.

లక్షల సంఖ్యలో వెహికల్స్..

లాక్​డౌన్ తర్వాత  సొంత వెహికల్స్ వాడకం పెరగడంతో సిటీలో రోడ్లన్నీ నిండిపోతున్నాయి. ఐటీ కారిడార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చాలా వరకు కంపెనీలు పూర్తిస్థాయిలో తెరుచుకోవడం, కొన్ని హైబ్రిడ్ మోడల్ నడుస్తుండటంతో ఎంప్లాయీస్ అంతా ఆఫీసులకు హాజరవుతున్నారు. వీరిలో చాలా మంది సొంత వెహికల్స్​లోనే వస్తుండగా.. ట్రాఫిక్​ సమస్య మరింత తీవ్రంగా మారింది. దీంతో హైటెక్​సిటీ, మాదాపూర్, కొండాపూర్ పరిసర ప్రాంతాలు ఐటీ కంపెనీలకు వెళ్లే వారి బైక్​లు, కార్లతో రద్దీగా కనిపిస్తున్నాయి. ఇలా లక్షల సంఖ్యలో వెహికల్స్​రోడ్ల మీదకు వస్తుండటంతో పొల్యూషన్ కూడా పెరుగుతోంది. దీన్ని తగ్గించి ఎంప్లాయీస్​లో  గ్రీన్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టేషన్​ను పెంపొందించేందుకు ఇటీవల కొంతకాలంగా ఐటీ కంపెనీలు పర్యావరణ రహిత ప్రయాణాన్ని ప్రోత్సహిస్తున్నాయి.

గ్రీన్ మైల్స్ పేరుతో..

ట్రాఫిక్ జామ్​లతో అవస్థలు పడే కంటే  మెట్రోలో జర్నీ ఈజీగా భావిస్తున్న చాలామంది ఎంప్లాయీస్ అందులోనే వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సొంత వెహికల్స్​ వాడకాన్ని తగ్గించి మెట్రోతోపాటు ఇతర షేరింగ్​ విధానాల్లో ఆఫీసుకు వచ్చేలా ఐటీ కంపెనీలు సైతం తమ ఎంప్లాయీస్​ను ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగానే హైదరాబాద్ మెట్రోతో కలిసి గ్రీన్ మైల్స్ క్యాంపెయిన్​ను నిర్వహిస్తున్నాయి. ‘ట్రావెల్ మోర్-.. విన్ మోర్’ అనే కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మెట్రో, ఆర్టీసీ, షేరింగ్ వెహికల్స్ లో ట్రావెల్ ​చేసేలా ఎంకరేజ్ ​చేస్తున్నాయి. అలా వచ్చి, వెళ్లే ఎంప్లాయీస్​ను గుర్తిస్తూ కంపెనీల్లోనే వారికి గిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, అవార్డులు అందజేస్తున్నారు. గత నెలలో ప్రారంభించిన ఈ అవార్డుల కార్యక్రమాన్ని వారంలో ఒకరోజు నిర్వహిస్తున్నారు. 

కిటకిటలాడుతున్న మెట్రో.. 

లాక్​డౌన్ తర్వాత నుంచి క్రమక్రమంగా మెట్రోలో జర్నీ చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.  దీంతో అన్ని మెట్రో స్టేషన్లు ప్యాసింజర్లతో కిటకిటలాడుతున్నాయి. మెట్రో ట్రైన్లలో తీవ్ర రద్దీ కనిపిస్తోంది. ప్రస్తుతం మెట్రోలో రోజుకి 4 లక్షల మందికి పైగానే ప్రయాణిస్తున్నారు.  గ్రీన్​ మైల్స్​​ను ప్రారంభించడంతో మెట్రోలో ప్యాసింజర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యం
లోనే మెట్రో ట్రైన్ల ప్రీక్వెన్సీని పెంచాలని ఐటీ ఎంప్లాయీస్ కోరుతున్నారు.

ట్రాఫిక్ కంట్రోలింగ్ దిశగా..

ప్రస్తుతం ట్రాఫిక్ విపరీతంగా ఉంటోంది. అంతా వర్క్​ ఫ్రమ్​ ఆఫీస్ ​చేస్తుండటంతో ఐటీ కారిడార్​లో పీక్ అవర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రోడ్లన్నీ రద్దీగా మారుతున్నాయి. ఈ ట్రాఫిక్​ను కంట్రోల్ చేసి ఎంప్లాయీస్ పబ్లిక్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టేషన్ ఉపయోగించే దిశగా గ్రీన్ మైల్స్ ఇన్నోవేషన్​ను ప్రారంభించాం. ఇది ట్రాఫిక్ కంట్రోలింగ్ కి ఉపయోగపడనుంది. ఇప్పటికే ఎంతోమంది ఐటీ ఎంప్లాయీస్ మెట్రో లాంటి పబ్లిక్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టేషన్​ను వాడుతున్నారు. మరింతమంది ఉపయోగించే విధంగా ఈ కాన్సెప్ట్ ఉపయోగపడనుంది.
‑ సత్యనారాయణ, తెలంగాణ ఫెసిలిటీస్ మేనేజ్​మెంట్ కౌన్సిల్ అధ్యక్షుడు 

మెట్రో ట్రైన్ల ఫ్రీక్వెన్సీని పెంచాలి

రెండేళ్లుగా మాదాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఓ కంపెనీలో జాబ్ చేస్తున్నా.  నా వెహికల్​లో  డైలీ ఆఫీసు వెళ్లేవాణ్ని. ఆఫీస్​కు వెళ్లేందుకు, అక్కడి నుంచి మళ్లీ ఇంటికి రావడానికి చాలా టైమ్ పట్టేది. అందుకే మెట్రో ట్రావెలింగ్ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకున్నా. ప్రస్తుతం మెట్రోలోనూ ఫుల్ రష్​ ఉంటోంది. మెట్రో ట్రైన్ల ఫ్రీక్వెన్సీ పెంచి, లాస్ట్ మైల్ కనెక్టివిటీని సరిగా మెయింటెన్ చేస్తే బాగుంటుంది.
‑ లక్ష్మణ్, సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌