న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు
గైడ్లైన్స్ జారీ చేసిన ప్రభుత్వం
బెంగళూరు/పాట్నా: వరల్డ్ వైడ్గా ఒమిక్రాన్ సబ్వేరియంట్ బీఎఫ్.7 కేసులు పెరుగుతుండటంతో కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఎక్కువమంది గుమిగూడొద్దని సూచించింది. కర్నాటక హెల్త్ మినిస్టర్ కేశవ సుధాకర్ సోమవారం పలు మార్గదర్శకాలను రిలీజ్ చేశారు. మూవీ థియేటర్లు, స్కూల్స్, కాలేజీల్లో తప్పకుండా మాస్క్ ధరించాలన్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా పబ్స్, రెస్టారెంట్స్, బార్స్లో మాస్క్ తప్పనిసరి చేయాలని ఆదేశించారు. రాత్రి ఒంటి గంటకల్లా న్యూ ఇయర్ వేడుకలు ముగించుకోవాలన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని, రాష్ట్ర ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని తెలిపారు. ప్రతీ ఒక్కరూ బూస్టర్ డోసు వేసుకోవాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు.
నలుగురు ఫారెనర్స్కు పాజిటివ్
బీహార్లోని గయా ఎయిర్ పోర్టులో చేసిన ఆర్టీపీసీఆర్ టెస్టులో నలుగురు ఫారెనర్స్కు పాజిటివ్ వచ్చిందని డిస్ట్రిక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రంజన్ సింగ్ తెలిపారు. వారిని ఐసోలేషన్కు తరలించినట్టు చెప్పారు. నలుగురిలో మయన్మార్, థాయ్లాండ్ నుంచి ఒక్కొక్కరు, ఇంగ్లండ్ నుంచి ఇద్దరు వచ్చినట్టు తెలిపారు. 33 మంది ఫారెనర్లకు టెస్ట్ చేయగా.. నలుగురికి పాజిటివ్ వచ్చిందన్నారు.