కేటీఆర్​ మళ్లీ మంత్రి కావాలి..అసద్​ ట్వీట్

కేటీఆర్​ మళ్లీ మంత్రి కావాలి..అసద్​ ట్వీట్

హైదరాబాద్, వెలుగు: టీఆర్​ఎస్​వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ను మళ్లీ మంత్రిగా చూడాలని ఉందని ఎంఐఎం చీఫ్​ అసదుద్దీన్​ ఒవైసీ ట్వీట్​ చేశారు. గతేడాది ఒప్పో, ఇటీవల అమెజాన్, ఇవాళ వన్‌ప్లస్‌ సెంటర్స్​తో హైదరాబాద్ అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతోందంటూ వచ్చిన ఓ ట్వీట్‌పై సోమవారం అసద్​ స్పందించారు. ఈ ఘనత మాజీ మంత్రి కేటీఆర్‌దేనని పేర్కొంటూ ఆయన ట్వీట్ చేశారు. ‘‘అంతర్జాతీయ సంస్థలు ఇక్కడికి రావడం వెనుక కేటీఆర్​కు క్రెడిట్​ ఇవ్వాలి. ఆయన మంత్రిగా మళ్లీ ప్రభుత్వంలోకి రావాలి” అని అందులో ఆకాంక్షించారు. ఒవైసీ ట్వీట్‌కు కేటీఆర్ కూడా స్పందిస్తూ.. ‘‘మెనీ థ్యాంక్స్​ ఎంపీ సాబ్.. ఫర్​ యువర్​ వెరీ కైండ్​ వర్డ్స్​’’​ అని కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో జరుగనున్న మంత్రివర్గ విస్తరణలో కేటీఆర్​ను తీసుకోవాలని సొంత పార్టీ నుంచే డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో అసద్​ ట్వీట్​.. దానికి కేటీఆర్​ స్పందన ఆసక్తికరంగా మారింది.