కోహ్లీ అభిమానులను మళ్లీ గెలికిన గంభీర్.. అసభ్యకరంగా మిడిల్ ఫింగర్ చూపిస్తూ

కోహ్లీ అభిమానులను మళ్లీ గెలికిన గంభీర్.. అసభ్యకరంగా మిడిల్ ఫింగర్ చూపిస్తూ

టీమిండియా మాజీ దిగ్గజం గౌతమ్ గంభీర్‌ ఎంత ఆవేశపరుడో అందరకీ విదితమే. విరాట్ కోహ్లీ అయినా మైదానంలో ఉన్నప్పుడు కాస్త ఆగి ఆలోచిస్తాడేమో కానీ గంభీర్‌కి అస్సలు కోపం ఆగదు. ముక్కుసూటిగా మాట్లాడుతాడు అన్న పేరున్నప్పటికీ.. అందరితో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంటారు. తాజాగా ఈ ఓపెనర్ మరోసారి అలాంటి వివాదంలో చిక్కుకున్నారు. 

మాములుగానే కోహ్లీ, గంభీర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉంటాయి. ఇలాటి పరిస్థితులలో అతనితో పెట్టుకుంటే ఊరుకుంటాడా! అస్సలు ఊరుకూలే. ప్రస్తుతం ఆసియా కప్ 2023 టోర్నీకి కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న గంభీర్, శ్రీలంకలో ఉన్నాడు. ఈ క్రమంలో ఇండియా- నేపాల్ మ్యాచ్ జరుగుతుండగా గంభీర్ మైదానం నుంచి డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తుండగా కోహ్లీ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అతన్ని చూసి కావాలనే కోహ్లీ.. కోహ్లీ అంటూ నినాదాలు చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన గంభీర్ వాళ్లకు మిడిల్ ఫింగర్ చూపించాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 
గంభీర్‌ అసభ్యకర సంజ్ఞలు చేయడంపై అభిమానులు మండిపడుతున్నారు. కోహ్లీ స్టార్ ఇమేజ్‌ను చూసి ఓర్వలేకపోతున్నాడని అతనిపై సెటైర్లు వేస్తున్నారు. ఇతర క్రికెటర్లను గౌరవించుకోవడం నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు. ఈ వివాదం మున్ముందు ఇంకెంత దూరం తీసుకెళ్తుందో చూడాలి.