బౌలింగ్ ఎంచుకున్న పాక్.. తిరిగి జట్టులో చేరిన ఇద్దరు వీరులు

బౌలింగ్ ఎంచుకున్న పాక్.. తిరిగి జట్టులో చేరిన ఇద్దరు వీరులు

సూపర్- 4 స్టేజిలో భారత్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ తుది జట్టును ఇప్పటికే ప్రకటించగా.. భారత జట్టులో రెండు మార్పులు జరిగాయి. ఊహించినట్లుగానే కేఎల్ రాహుల్‌కు ప్లేయింగ్ 11లో చోటు దక్కగా, గత మ్యాచ్‌కు దూరమైన భారత స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులో అవకాశం దక్కించుకున్నాడు.

కాగా, లీగ్‌ స్టేజ్‌లో దాయాదుల మధ్య మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయిన  విషయం తెలిసిందే. సూపర్- 4 దశలో ఆదివారం మరోమారు చిరకాల ప్రత్యర్థులు అమీతుమీ తేల్చుకోనున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు కూడా వరుణుడి నుంచి ముప్పు పొంచి ఉండగా.. సోమవారం రిజర్వ్‌ డే ఉండటం ఆనందించాల్సిన విషయం.

ALSOREAD:IND vs PA: కొలంబోలో ఎండ..ఇక పాక్కు దబిడి దిబిడే..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
 
పాకిస్తాన్: ఫఖర్ జమాన్, ఇమాముల్ హక్, బాబర్ అజామ్ (కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్, అఘా సల్మాన్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, హారిస్ రౌఫ్, నజీమ్ షా, షాహీన్ అఫ్రీది.