
ప్యోంగ్చాంగ్(సౌత్ కొరియా): ఆసియా టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్స్లో ఇండియా మెన్స్ టీమ్ సెమీఫైనల్ చేరి బ్రాంజ్ మెడల్ ఖాయం చేసుకుంది. సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఇండియా 3–0తో సింగపూర్పై విజయం సాధించింది. శరత్ కమల్, సత్యన్, హర్మీత్ దేశాయ్ తమ మ్యాచ్ల్లో గెలిచారు.
బుధవారం జరిగే సెమీస్లో చైనీస్ తైపీతో ఇండియా పోటీ పడనుంది. మరోవైపు విమెన్స్ టీమ్ క్వార్టర్ ఫైనల్లో ఇండియా 0–3తో జపాన్ చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది.