- కోచ్ రవికుమార్ సైతం..
కోల్బెల్ట్/ఆసిఫాబాద్, వెలుగు: హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా శనివారం రాత్రి జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్లో ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీతో ఆడే అవకాశం ఆదిలాబాద్ఉమ్మడి జిల్లా క్రీడాకారుణికి దక్కింది. అసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్లో తొమ్మిదో తరగతి స్టూడెంట్ సీహెచ్.ఆర్తి.. లియోనల్ మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఫుట్బాల్ ఆడింది.
ఫుట్బాల్ కోచ్గా పనిచేస్తున్న మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్కు చెందిన సీనియర్ క్రీడాకారుడు సప్పిడి రవికుమార్ నేతృత్వంలో సింగరేణి ఆర్ఆర్ టీం తరఫున పాల్గొన్నారు. ఆర్తీకి 2023–24 లో నేషనల్ లెవల్ ఫుట్ బాల్ టోర్నీలో ఆడిన అనుభవం ఉంది. ఫుట్బాల్దిగ్గజం మెస్సీతో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్లో తమ స్కూల్కు చెందిన క్రీడాకారుణి ఆర్తీతోపాటు తాను పాల్గొనడంపై కోచ్రవికుమార్ ఆనందం వ్యక్తం చేశారు. మెస్సీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడం మరిచిపోలేని అనుభూతి అని ఉబ్బితబ్బిబ్బయ్యారు.
