రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ‘ఎట్ హోమ్’ ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, సీజేఐ డీవై చంద్రచూడ్, డిప్లమాట్లు, వివిధ పార్టీల నేతలు, ఇతర గెస్టులు హాజరయ్యారు.
రిపబ్లిక్ డే సందర్భంగా ఇండియా- పాక్ బార్డర్ లోని వాఘా వద్ద బీటింగ్ రిట్రీట్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) సోల్జర్లు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర లిఖిస్తూ భారత్ సాధించిన చంద్రయాన్- 3 విజయం, ఆదిత్య ఎల్1 మిషన్లపై ఇస్రో రిపబ్లిక్డే పరేడ్లో ప్రదర్శించిన శకటం ఆకట్టుకున్నది. చంద్రుడిపై మన విక్రమ్ ల్యాండర్ దిగుతున్న విజువల్స్, శివశక్తి పాయింట్ను శకటంపై ప్రదర్శించారు.
రామ జన్మభూమిలో నిర్మించిన బాలక్ రామ్ మందిర్ థీమ్తో ఉత్తరప్రదేశ్ప్రభుత్వ శకటం రూపొందించింది. విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకకు ప్రతీకగా అధికారులు దీనిని తీర్చిదిద్దారు. 'అయోధ్య : విక్షిత్ భారత్-సమ్రాధ్ విరాసత్' పేరుతో ప్రదర్శించిన ఈ శకటం ఆకట్టుకుంది.