నలభై ఏళ్ల వయసులో.. త్రిష వరుస సినిమాలు

నలభై ఏళ్ల వయసులో.. త్రిష వరుస సినిమాలు

మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ త్రిష(Trisha) వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం యంగ్ హీరోలతో పాటు..సీనియర్ హీరోలతోను యాక్ట్ చేస్తుంది. ప్రస్తుతం త్రిష చేతిలో అరడజనుకి పైగా మూవీస్ ఉన్నట్లు తెలుస్తోంది.

డైరెక్టర్ లోకేష్ కనగరాజు..విజయ్ కాంబోలో వస్తోన్న లియో మూవీలో హీరోయిన్గా నటిస్తూనే, స్టార్ హీరో అజిత్ లేటెస్ట్ మూవీ విదా మూయుర్చిలో నటిస్తుంది. అలాగే కమల్..మణిరత్నం కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంతో పాటు.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ రామ్ మూవీలో కూడా నటిస్తుంది. ఇక త్రిష ది రోడ్‌  మూవీలో కనిపిస్తుంది, ఇది రివెంజ్ డ్రామా అక్టోబర్ 6, 2023న విడుదల కానుంది. వీటితో పాటు మరికొన్ని కొత్త ప్రాజెక్ట్స్కు త్రిష ఆల్రెడీ సైన్ చేసినట్లు తెలుస్తోంది.   

ఇక రీసెంట్గా..13 ఏళ్లకు ముందు  డైరెక్టర్ పెట్టిన ట్వీట్కు..త్రిష రెస్పాండ్ అవుతూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.  2007లో తమిళ డైరెక్టర్ సెల్వరాఘవన్‌ (Selvaraghavan) తెరకెక్కించిన సినిమా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే(Aadavari Maatalaku Arthake Verule).

వెంకటేశ్‌(Vekatesh) కు జోడీగా నటించిన ఫ్యామిలీ..లవ్,ఎమోషనల్ సీక్వెల్లో యాక్ట్ చేయడానికి రెడీ అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.  స్టార్ హీరోలతో పోటీ పడుతూనే  లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో చేస్తూ తన సత్తా చాటుకుంటోంది. త్రిష 25 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటూ..అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్‌గా హావా కొనసాగిస్తోంది.

ఇక చిరంజీవి.. బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ కాంబోలో వస్తోన్న మూవీలో కూడా ఛాన్స్ దక్కించుకున్నట్టు సమాచారం. 1999 లో జోడీ మూవీతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన త్రిష, ఇక తెలుగులో నీ మనసు నాకు తెలుసు మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా రాణిస్తోంది. రీసెంట్గా మణిరత్నం పొన్నియన్ సెల్వన్ మూవీలో నటించి హిట్ కొట్టింది. దీంతో వరుస అవకాశాలతో త్రిష బిజీగా మారిపోయింది.