సెప్టెంబర్ 22న అట్లాంటా ఎలక్ట్రికల్స్ ఐపీఓ

సెప్టెంబర్ 22న అట్లాంటా ఎలక్ట్రికల్స్ ఐపీఓ

న్యూఢిల్లీ: అట్లాంటా ఎలక్ట్రికల్స్  ఐపీఓ ఈనెల 22–24 తేదీల మధ్య ఉంటుంది. కంపెనీ దీని ద్వారా రూ.687 కోట్ల నిధులు సేకరించనుంది. ప్రైస్​బ్యాండ్​ను రూ.718–రూ.754 మధ్య నిర్ణయించారు. దీని ద్వారా అట్లాంటాకు రూ.5,800 కోట్ల విలువ లభిస్తుంది. 

ఈ ఐపీఓలో రూ.400 కోట్ల విలువైన కొత్త షేర్లు జారీ అవుతాయి. ప్రమోటర్, ఇతర వాటాదారులు రూ.287 కోట్ల విలువైన 38.1 లక్షల ఈక్విటీ షేర్లను ఓఎఫ్​ఎస్​ కింద అమ్ముతారు. 

ఐపీఓ ద్వారా వచ్చే నిధులను కంపెనీ అప్పులు తీర్చడానికి, కార్యకలాపాలకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వాడతారు.