ఉక్రెయిన్పై రష్యా యుద్ధం 14వ రోజుకు చేరుకుంది. ప్రజలను తరలించేందుకు గ్రీన్ కారిడార్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించినా.. రాజధాని కీవ్, సూమీ వంటి నగరాలపై రష్యా దాడులను తీవ్రం చేసింది. ఇటు ఉక్రెయిన్ సైనికులూ రాజధాని చుట్టూ గట్టి బందోబస్తుతో కాచుకుని ఉన్నారు. సూమీలో మంగళవారం అర్ధరాత్రి రష్యా జరిపిన దాడుల్లో 22 మంది చనిపోయినట్టు ఉక్రెయిన్ వెల్లడించింది. రష్యా దాడుల నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ప్రైవేట్కార్లలో నగరం విడిచి పారిపోతున్నారని సూమీ మేయర్ అలెగ్జాండర్ లైషెంకో చెప్పారు. లుగాన్స్క్లోనూ బుధవారం సాయంత్రం భారీ పేలుళ్లు జరిగాయి. జైటోమిర్లోని ఓ డార్మిటరీపై రష్యా దాడిలో నలుగురు చనిపోయారు. సెవెరోడొనెట్స్క్లో 10మంది చనిపోయారు. ఖార్కివ్లోనూ దాడులు కొనసాగుతున్నాయి.
12 వేల మంది రష్యా సైనికులు చనిపోయిన్రు
యుద్ధంలో 12 వేల మంది రష్యా సైనికులు చనిపోయినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. 49 ఎయిర్క్రాఫ్ట్స్, 81 హెలికాప్టర్లు, 317 యుద్ధ ట్యాంకులు, 60 సిస్టర్న్లు, 7 డ్రోన్లు, 1,070 సాయుధ సైనిక వాహనాలు, 120 ఫిరంగులు, 56 రాకెట్ లాంచర్లు, 482 వాహనాలు, 3 వార్షిప్స్, 28యుద్ధ విమాన విధ్వంసక క్షిపణి వ్యవస్థలు నాశనమయ్యాయని తెలిపింది.