ఆస్ట్రేలియన్ ఓపెన్: సాత్విక్ - చిరాగ్ శుభారంభం

 ఆస్ట్రేలియన్ ఓపెన్: సాత్విక్ - చిరాగ్ శుభారంభం

సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాయిరాజ్–చిరాగ్ షెట్టి శుభారంభం చేశారు.  మంగళవారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబుల్స్ తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఇండియా జోడీ 25–-23, 21–-16 తో చైనీస్ తైపీకి చెందిన చాంగ్ కో-చి– పో లి-వియ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గెలిచింది. 

 48 నిమిషాల పాటు జరిగిన ఈ పోరాటంలో తొలి గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మొదట  వెనుకంజ వేసిన సాత్విక్–చిరాగ్ 19-–17తో తిరిగి ఆధిక్యంలోకి వచ్చారు.  చివర్లో తీవ్ర ఉత్కంఠ మధ్య గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిచారు. 

రెండో గేమ్ ఆరంభం నుంచే ఆధిపత్యం చూపెట్టారు. రెండు అద్భుతమైన స్మాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ముగించారు. అయితే, విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ10–-21, 14–-21తో  కుసుమ–పుష్పితాసరి (ఇండోనేసియా) చేతిలో ఓడి తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఇంటిదారి పట్టారు.