ఆటో అమ్మకాలు 11 శాతం అప్​ .. గత ఏడాది 2.38 కోట్ల బండ్లను అమ్మిన డీలర్లు

ఆటో అమ్మకాలు 11 శాతం అప్​ .. గత ఏడాది 2.38 కోట్ల బండ్లను అమ్మిన డీలర్లు
  • పీవీల అమ్మకాల్లో 11 శాతం పెరుగుదల
  • 9 శాతం పెరిగిన టూవీలర్​ అమ్మకాలు

 న్యూఢిల్లీ:  రోడ్లపైకి గత ఏడాది కోట్ల సంఖ్యలో కొత్త బండ్లు వచ్చాయి. వీటికి అన్ని ప్రాంతాల నుంచి భారీ డిమాండ్​​ కనిపించింది.  వెహికల్ ​డీలర్స్ అసోసియేషన్​ ఫాడా ప్రకారం ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు 2022తో పోలిస్తే కిందటేడాది 11 శాతం పెరిగాయి.    మొత్తం దేశీయ ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు 2022లో 2,14,92,324 యూనిట్లతో పోలిస్తే 2023 క్యాలెండర్ సంవత్సరంలో 2,38,67,990 యూనిట్లుగా ఉన్నాయి. ప్యాసింజర్ వెహికల్స్​ విక్రయాలు గత ఏడాది 38,60,268 యూనిట్లుగా ఉన్నాయి. 2022లో 34,89,953 యూనిట్ల నుంచి 11 శాతం వృద్ధి చెందాయి. టూవీలర్స్ రిటైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు గత ఏడాది 9 శాతం వృద్ధితో 1,55,88,352 యూనిట్ల నుంచి 1,70,61,112 యూనిట్లకు పెరిగాయి.

 త్రీవీలర్ అమ్మకాలు 2022లో 6,81,812 యూనిట్ల నుంచి గతేడాది 58 శాతం పెరిగి 10,80,653 యూనిట్లకు చేరుకున్నాయి. కమర్షియల్​ వెహికల్స్​ రిటైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు 2022లో 9,18,284 యూనిట్ల నుంచి 8 శాతం పెరిగి 9,94,330 యూనిట్లకు చేరుకున్నాయి. ట్రాక్టర్ రిటైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు 8,71,627 యూనిట్లకు పెరిగాయి. అంతకు ముందు సంవత్సరంలో విక్రయించిన 8,13,923 యూనిట్ల నుంచి 7 శాతం వృద్ధి కనిపించింది. డిసెంబర్ 2023లో, మొత్తం దేశీయ ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు డిసెంబర్ 2022లో 16,43,514 యూనిట్లతో పోలిస్తే 21 శాతం పెరిగి 19,90,915 యూనిట్లకు పెరిగాయి. ప్యాసింజర్ వెహికల్స్​ రిటైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు గత నెలలో 2,93,005 యూనిట్లకు పెరిగాయి. డిసెంబర్ 2022తో పోలిస్తే ఈ సంఖ్య  3 శాతం ఎక్కువ. టూవీలర్స్​ వెహికల్స్​ విక్రయాలు డిసెంబర్ 2023లో 11,36,465 యూనిట్లతో పోలిస్తే 28 శాతం పెరిగి 14,49,693 యూనిట్లకు చేరుకున్నాయి.

మున్ముందు కూడా  భారీ అమ్మకాలు

ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఫెడరేషన్ (ఫాడా) దేశవ్యాప్తంగా 1,442 ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో 1,355 విక్రయాల డేటా సాయంతో ఈ రిపోర్టును తయారు చేసింది.  కొత్త ఉత్పత్తుల లాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, బలమైన మార్కెట్ సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో ప్యాసింజర్ వెహికల్స్​సేల్స్​ వృద్ధి చెందుతాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. టూవీలర్స్ సెగ్మెంట్​ కొత్త మోడల్ లాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వల్ల బాగా ఎదిగిందని , ముఖ్యంగా సంవత్సరం మొదటి అర్ధభాగంలో  భారీగా ఈవీలు అమ్ముడయ్యాయని తెలిపింది. తక్కువ ఇంధన ధరలు,  రైతులకు పంట చెల్లింపులు వంటి కారణాల వల్ల ఇక నుంచి కూడా డిమాండ్​ బాగుండవచ్చని ఫాడా అంచనా వేసింది.  ఎన్నికల కారణంగా పెరిగిన ప్రభుత్వ వ్యయం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు  బొగ్గు, సిమెంట్  ఇనుప ఖనిజం వంటి కీలక పరిశ్రమలలో డిమాండ్ కారణంగా కమర్షియల్​ వెహికల్స్​ విభాగం వృద్ధి చెందుతుందని ఫాడా మెంబర్​  ఒకరు తెలిపారు. పాత వెహికల్స్​ రీప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ వల్ల ఆటో మార్కెట్ కూడా లాభపడుతుందని అన్నారు.