హైదరాబాద్కు చెందిన ఎన్సీసీ... నేషనల్ అవార్డ్స్ ఫర్ ఎక్స్లెన్స్ ఇన్ కాస్ట్ మేనేజ్మెంట్లోని "ఇన్ఫ్రాస్ట్రక్చర్ & కన్స్ట్రక్షన్" విభాగంలో మొదటి స్థానాన్ని గెలుచుకుంది. ఈ అవార్డు ప్రధానోత్సవాన్ని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ నిర్వహించింది. ఎన్సీసీ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ రాజు డైరెక్టర్ (ప్రాజెక్ట్స్), సీఎఫ్ఓ సంజయ్ పుసర్ల, సీజీఎం శ్రీనివాసరావు పాల్గొని అవార్డును తీసుకుకున్నారు. ఎన్సీసీ ఇంతకుముందు ఈ జాతీయ అవార్డును రెండుసార్లు పొందింది
హెచ్పీ నుంచి 3 ల్యాప్టాప్లు
ఎలక్ట్రానిక్స్ కంపెనీ హెచ్పీ ఇండియా మార్కెట్లో ఓమెన్ సిరీస్లో రెండు ల్యాప్టాప్ను, మరో ఒమెన్ ల్యాప్టాప్ను లాంచ్ చేసింది. ధరలు రూ.60 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు ఉన్నాయి. ఇవి గేమింగ్ ల్యాప్టాప్లు. స్మూత్ గేమ్ప్లే, ఎక్కువ రిజల్యూషన్, ఫాస్ట్ ప్రాసెసర్లు, లేటెస్ట్ డిజైన్లు, బ్రైట్ విజువల్స్ వంటివి వీటి ప్రత్యేకతలు. ల్యాప్టాప్లతో పాటు హైపర్ ఎక్స్ వైర్లెస్ గేమింగ్ హెడ్సెట్ను, డిస్ప్లే మానిటర్ను కూడా హెచ్పీ అందుబాటులోకి తెచ్చింది.