
- 14 రోజుల పాటు హోమాలు
- వివరాలు వెల్లడించిన శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద
షాద్ నగర్, వెలుగు: విశ్వశాంతి కోసం నేటి నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు షాద్ నగర్ పట్టణంలో ఆయుత చండీ అతిరుద్ర మహాయాగాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామిజీ తెలిపారు. బుధవారం షాద్నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇప్పటివరకు 80 మహా యాగాలను నిర్వహించామన్నారు. 81వ మహాయాగాన్ని నేటి నుంచి షాద్ నగర్ పట్టణంలోని జడ్చర్ల రోడ్లో టౌన్ షిప్ ఎదురుగా ఉన్న వ్యవసాయ భూమిలో నిర్వహిస్తున్నామన్నారు. 650 మంది రుత్వికులు 14 రోజుల పాటు యాగాలు, హోమాలు చేస్తారన్నారు.