జీటీఏ స్టేట్ ప్రెసిడెంట్​గా విద్యాసాగర్.. నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక

జీటీఏ స్టేట్ ప్రెసిడెంట్​గా విద్యాసాగర్.. నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక
  •     నూతన రాష్ట్ర  కమిటీ ఎన్నిక 

హైదరాబాద్, వెలుగు :  గవర్నమెంట్  టీచర్స్  అసోసియేషన్ (జీటీఏ) రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా బి.విద్యాసాగర్ ఎన్నికయ్యారు. ఆదివారం యూసుఫ్ గూడలో జీటీఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘం కొత్త రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా డి.వాసుదేవరావు, ట్రెజరర్​ గా ఎస్.శ్రీనివాస్​, వైస్​ ప్రెసిడెంట్​గా జయకర్, జాయింట్  సెక్రటరీగా ఇ.రామకృష్ణారెడ్డి, మహిళా కార్యదర్శిగా వి. మేరీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని నేతలు తెలిపారు. 

ఈ సందర్భంగా నూతన రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డిప్యూటీ ఈఓ, డిప్యూటీ ఐఓఎస్, ఎంఈఓ, గ్రేడ్ 1 హెడ్మాస్టర్  తదితర పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.