పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని బస్టాండ్ సెంటర్లో నిర్మించిన బాబు జగ్జీవన్ రామ్ బిల్డింగ్, కాంస్య విగ్రహాన్ని శుక్రవారం రాత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జగ్జీవన్ రామ్ మనవడు, ఏఐసీసీ స్పోక్స్ పర్సన్ అన్ఫుల్ అవిజిత్, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ గణేశ్, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య.. తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని వేణుగోపాల్ టాకీస్ ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వ హించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, కళాకారుడు ఏపూరి సోమన్న, రా ష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు, కమిటీ గౌరవ అధ్యక్షులు భాస్కరరావు, ప్రకాశ్రావు, దేవదాసు, గజ్జి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
