
జీడిమెట్ల, వెలుగు: నిర్లక్ష్యంగా డ్రైనేజీ పనులు చేయిస్తూ.. గ్యాస్పైప్లైన్ లీకేజీకి కారణమైన ఇంజనీరింగ్ కాలేజీ మేనేజ్ మెంట్ పై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. రాజీవ్గాంధీనగర్ లో మంగళవారం రాత్రి బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్కాలేజీ యాజమాన్యం డ్రైనేజీ పనులు చేయిస్తుంది. నిర్లక్ష్యంగా పనులు చేయగా.. భాగ్యలక్ష్మీ గ్యాస్ పైప్లైన్ పగిలిపోయింది.
దీంతో ఒక్కసారిగా గ్యాస్ లీకేజీ అయి స్థానికులు భయాందోళన చెందారు. ట్రాఫిక్జామ్ అయింది. బాచుపల్లి సీఐ ఉపేందర్, ఎస్ఐ సంధ్య సిబ్బందితో వెళ్లి ట్రాఫిక్మళ్లించారు. ఫైర్, గ్యాస్ ఏజెన్సీకి సమాచారం ఇచ్చారు. దీంతో గ్యాస్నిర్వాహకులు వచ్చి మరమ్మతులు చేపట్టారు. బీవీఆర్ ఐటీ కాలేజీ మేనేజ్ మెంట్ పై కేసు నమోదు చేసినట్టు సీఐ ఉపేందర్ తెలిపారు.