న్యూఢిల్లీ: బజాజ్ ఫిన్సర్వ్లో భాగమైన బజాజ్ ఫైనాన్స్ చాలా టెన్యూర్ల (కాలవ్యవధి) ఎఫ్డీలపై వడ్డీ రేటును 60 బేసిస్ పాయింట్లు పెంచింది. బజాజ్ ఫైనాన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్అయిన డిపాజిట్- టేకింగ్ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ). ఇది ఏప్రిల్ 3, 2024 నుంచి 25–-35 నెలల టెన్యూర్ సీనియర్ సిటిజన్ల ఎఫ్డీ రేట్లను 60 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది.
18-–24 నెలల టెన్యూర్ఎఫ్డీపై వడ్డీ 40 బేసిస్ పాయింట్లు పెంచింది. నాన్–-సీనియర్ సిటిజన్ల కోసం, 25-–35 నెలల టెన్యూర్కు 45 బేసిస్ పాయింట్ల వరకు, 18– 22 నెలల ఎఫ్డీపై 40 బేసిస్ పాయింట్లు 30–33 నెలల ఎఫ్డీపై 35 బేసిస్ పాయింట్ల వరకు రేట్లను పెంచినట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. సీనియర్ సిటిజన్లు ఇక నుంచి కూడా 8.85 శాతం వరకు వడ్డీ పొందవచ్చు.
సీనియర్ సిటిజన్లు కానివారు 42 నెలల టెన్యూర్ఎఫ్డీని డిజిటల్గా బుక్ చేసుకోవడం ద్వారా 8.6 శాతం వరకు రేట్లను పొందవచ్చు. పెరిగిన వడ్డీ రేట్ల వల్ల పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన రాబడులు వస్తాయని బజాజ్ ఫైనాన్స్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ఇన్వెస్ట్మెంట్స్ హెడ్ సచిన్ సిక్కా అన్నారు. కంపెనీ దేశంలోనే అతిపెద్ద డిపాజిట్ -స్వీకరణ ఎన్బీఎఫ్సీగా తాము నిలిచామని అన్నారు. డిపాజిట్బుక్ విలువ ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ. 60 వేల కోట్లపైగా ఉందని వివరించారు.