సిటీ రోడ్లపై స్పీడ్ లిమిట్,సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్న జీహెచ్ఎంసీ

సిటీ రోడ్లపై స్పీడ్ లిమిట్,సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్న జీహెచ్ఎంసీ

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ రోడ్లపై వెహికల్ స్పీడ్ లిమిట్​కు సంబంధించి బల్దియా సైన్ బోర్డులను ఏర్పాటు చేస్తోంది. గ్రేటర్ లిమిట్స్​లో ప్రస్తుతం గంటకు 60 కి.మీ. స్పీడ్ లిమిట్​మాత్రమే ఉంది. మధ్యలో డివైడర్ ఉండి 2 లేన్లు,  అంతకుపైగా ఉన్న రోడ్లపై కార్లకు గంటకు 60 కి.మీ , బైక్​లు, మిగతా వెహికల్స్ కు 50 కి.మీ. వేగంతో ప్రయాణించాలనే రూల్​ఉంది. డివైడర్ లేని రోడ్లపై కార్లు అయితే 50  కి.మీ. వేగం, టూవీలర్​, మిగతా వెహికల్స్​ 40 కి.మీ. స్పీడ్ తో ప్రయాణించాల్సి ఉంటుంది. ఇప్పటికే  మెయిన్ రోడ్లపై స్పీడ్ లిమిట్​కు సంబంధించిన సైన్ బోర్డులను జోనల్ స్థాయిలో బల్దియా అధికారులు ఏర్పాటు చేశారు.  

ప్రమాదాలను నివారించేందుకు..

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు స్పీడ్ లిమిట్​ను ఫాలో కావాలని అధికారులు సూచిస్తున్నారు. ట్రాఫిక్ తక్కువగా ఉన్న రోడ్లపైనే ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.  కాలనీల్లోని రోడ్లపై కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఓవర్ స్పీడ్ వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయని గుర్తించిన అధికారులు స్పీడ్ లిమిట్​ను నిర్ణయించారు. యాక్సిడెంట్లను కంట్రోల్​ చేయాలంటే సైన్ బోర్డులను ఏర్పాటు చేసి, పలు డిపార్ట్ మెంట్లతో కలిసి మరింత అవగాహన కల్పిస్తామని బల్దియా అధికారులు చెబుతున్నారు. 

కో ఆర్డినేషన్ మీటింగ్​లు

స్పీడ్ లిమిట్​కు సంబంధించిన నోటిఫికేషన్ ఆరు నెలల కిందటే వచ్చింది.  జోనల్ స్థాయిలో రవాణా, ట్రాఫిక్ పోలీసులతో కో ఆర్డినేషన్ మీటింగ్​లు నిర్వహించిన అనంతరం జీహె
చ్ఎంసీ అధికారులు సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు.  కొద్దిరోజుల్లో కాలనీ రోడ్లపై వీటిని ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ జోనల్ స్థాయి అధికారులు చెబుతున్నారు.