గడపగడపకు కాంగ్రెస్​ మేనిఫెస్టో తీసుకెళ్తాం : సునీల్​రెడ్డి

గడపగడపకు కాంగ్రెస్​ మేనిఫెస్టో తీసుకెళ్తాం : సునీల్​రెడ్డి

బాల్కొండ, వెలుగు: కాంగ్రెస్​పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను కార్యకర్తల ద్వారా ప్రతీ ఇంటికి తీసుకెళ్లి ప్రజల ఆశీస్సులతో విజయం సాధిస్తానని బాల్కొండ కాంగ్రెస్​అభ్యర్థి ముత్యాల సునీల్​రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మానాల, దేవగాతండా, అడ్డబార్ తండా, ఈదైడి తండాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్​రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే గిరిజనులందరికీ పోడు పట్టాలు ఇస్తామన్నారు.

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు వారికి తోడ్పాటునందిస్తామన్నారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ, రూ.500 వంట గ్యాస్​సిలిండర్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌలత్​కల్పిస్తామన్నారు. పంట పెట్టుబడి సహాయంగా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్నారు. ఒక్కసారి అవకాశమిచ్చి తనను గెలిపించాలన్నారు. తిమ్మాపూర్​ గ్రామానికి చెందిన మనోహర్​రెడ్డి, నిఖిల్, గంగారెడ్డి, రెంజర్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్​ నేతలు బాస మల్లేశ్, దాసు, గంగాధర్, శేఖర్,​ వేల్పూర్​ మండలానికి చెందిన సచిన్, రమేశ్, శశాంక్, నవనీత్​ తదితరులు కాంగ్రెస్​లో చేరారు.