డిపాజిట్లను తీసుకోకుండా పేటీఎంపై నిషేధం

డిపాజిట్లను తీసుకోకుండా పేటీఎంపై నిషేధం

ముంబై: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌‌‌‌ వచ్చే నెల 29 నుంచి కస్టమర్ ఖాతా, ప్రీపెయిడ్ ఇన్​స్ట్రమెంట్స్​, వాలెట్లు,  ఫాస్ట్‌‌‌‌ట్యాగ్‌‌‌‌లలో డిపాజిట్లు లేదా టాప్-అప్‌‌‌‌లను తీసుకోకుండా  ఆర్​బీఐ రిస్ట్రిక్షన్లు పెట్టింది.   సిస్టమ్ ఆడిట్ నివేదిక,  ఎక్స్​టర్నల్​ ఆడిటర్‌‌‌‌ కాంప్లయన్స్​ వాలిడేషన్​ రిపోర్ట్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ​ బ్యాంక్​లో నిబంధనలను ఉల్లంఘించినట్టు గుర్తించామని పేర్కొంది.  

అయితే, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, కరెంట్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, ఫాస్ట్‌‌‌‌ట్యాగ్‌‌‌‌లు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్‌‌‌‌లు వంటి వారి ఖాతాల నుంచి కస్టమర్లు తమ  బ్యాలెన్స్‌‌‌‌లను ఉపసంహరించుకోవచ్చు.  ఇదిలా ఉంటే,  కొత్త కస్టమర్‌‌‌‌లను తీసుకోవడాన్ని  ఆపివేయాలని పేటీఎంపై  ఆర్​బీఐ 2022 మార్చిలోనూ రిస్ట్రిక్షన్లు పెట్టింది.