
ముంబై: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ వచ్చే నెల 29 నుంచి కస్టమర్ ఖాతా, ప్రీపెయిడ్ ఇన్స్ట్రమెంట్స్, వాలెట్లు, ఫాస్ట్ట్యాగ్లలో డిపాజిట్లు లేదా టాప్-అప్లను తీసుకోకుండా ఆర్బీఐ రిస్ట్రిక్షన్లు పెట్టింది. సిస్టమ్ ఆడిట్ నివేదిక, ఎక్స్టర్నల్ ఆడిటర్ కాంప్లయన్స్ వాలిడేషన్ రిపోర్ట్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంక్లో నిబంధనలను ఉల్లంఘించినట్టు గుర్తించామని పేర్కొంది.
అయితే, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, కరెంట్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, ఫాస్ట్ట్యాగ్లు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్లు వంటి వారి ఖాతాల నుంచి కస్టమర్లు తమ బ్యాలెన్స్లను ఉపసంహరించుకోవచ్చు. ఇదిలా ఉంటే, కొత్త కస్టమర్లను తీసుకోవడాన్ని ఆపివేయాలని పేటీఎంపై ఆర్బీఐ 2022 మార్చిలోనూ రిస్ట్రిక్షన్లు పెట్టింది.