హైదరాబాద్, వెలుగు: అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఈనెల 4న కోచింగ్ సెంటర్ల బంద్కు పీడీఎస్ యూ, పీవైఎల్ పిలుపునిచ్చాయి. ఆదివారం హైదరాబాద్లోని మార్క్స్భవన్లో దీనికి సంబంధించిన పోస్టర్లను సంఘాల నేతలు ఆవిష్కరించారు.
పీవైఎల్, పీడీఎస్యూ రాష్ర్ట కార్యదర్శులు కేఎస్ ప్రదీప్, రాము మాట్లాడుతూ ఏడాది నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, ఈ నెల 6 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో నిరుద్యోగ సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. పీడీఎస్ యూ రాష్ర్ట అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్, పీవైఎల్ రాష్ర్ట నాయకులు పాల్గొన్నారు.