రైతులను తప్పుదోవ పట్టిస్తున్న మంత్రులు

రైతులను తప్పుదోవ పట్టిస్తున్న మంత్రులు

 కాగజ్నగర్ : రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఢిల్లీ వెళ్లిన మంత్రులు బాయిల్డ్ రైస్పై చర్చ పేరుతో రైతుల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. కుమ్రం భీం జిల్లా కాగజ్ నగర్ లో జరిగిన బీజేపీ శిక్షణా తరగతులను ఆయన హాజరయ్యారు. ప్రభుత్వం చేపట్టిన టీచర్ల బదిలీల్లో అక్రమాలు జరిగాయని బండి సంజయ్ ఆరోపించారు. ఉపాధ్యాయులపై కేసీఆర్ సర్కారు కక్ష సాధిస్తోందని మండిపడ్డారు. 

మరిన్ని వార్తల కోసం..

మహిళల భద్రతను గాలికొదిలేసి.. మద్యం అమ్మకాలు

గాదరి కిషోర్ కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్