ఈటల రాజేందర్ను పరామర్శించిన బండి సంజయ్..రాళ్ల దాడిపై ఆరా

ఈటల రాజేందర్ను పరామర్శించిన బండి సంజయ్..రాళ్ల దాడిపై ఆరా

మునుగోడులో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ శ్రేణులు..బీజేపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఇబ్రహీంపట్నంలోని ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా నివాసంలో ఉన్న ఈటల రాజేందర్ను పరామార్శించి.. రాళ్ల దాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మర్రిగూడ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తమను కూడా అడ్డుకునేందుకు టీఆర్ఎస్ గూండాలు ప్రయత్నించి భంగపడ్డారని సంజయ్ చెప్పారు. 

హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. రాళ్ల దాడిలో కాన్వాయ్ అద్దాలు ధ్వంసం అవగా..పలువురికి గాయాలయ్యాయి. టీఆర్ఎస్ కార్యకర్తల పనే అంటూ బీజేపీ ఆరోపించింది. పోలీసుల తీరు పై ఈటల ఫైర్ అయ్యారు. పోలీసులు నిర్లక్ష్యంగా ఉండటం వల్లే కాన్వాయ్ పై దాడి జరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.