సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోండి: సీఎం రేవంత్ కు సంజయ్ లేఖ

 సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోండి: సీఎం రేవంత్ కు సంజయ్ లేఖ

సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. బతుకమ్మ చీరల బకాయిల సొమ్ము 220 కోట్లను గత ప్రభుత్వం చెల్లించకపోవడంవల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. చేనేతపై ఆధారపడ్డ 20 వేల మంది కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

 గత ఏడేళ్లుగా ప్రభుత్వ ఆర్డర్లపైనే ఆధార పడి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మనుగడ సాగిస్తోందని.. కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తక్షణమే మొత్తం  బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. 'వర్కర్‌ టు ఓనర్‌' పథకానికి నిధులు మంజూరు చేసి సంపూర్ణంగా అమలు చేయాలన్నారు. సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్  ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపితే.. కేంద్రం దృష్టికి తీసుకెళతానని బహిరంగ లేఖలో బండి సంజయ్ హామీ ఇచ్చారు.