బీజేపీ జిల్లా అధ్యక్షులతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్

బీజేపీ జిల్లా అధ్యక్షులతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్

ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేయాలని.. ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షులు, వివిధ మోర్చాల నేతలతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టీఆర్ఎస్ నేతల అరాచకాలను తిప్పి కొట్టాలని.. నిరసనలు కొనసాగించాలని వారికి సూచించారు. సీఎం కేసీఆర్ నియంత పాలనను నిరసిస్తూ ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేయాలని ఆదేశించారు. ఎంపీ అర్వింద్ తల్లిని భయభ్రాంతులకు గురి చేశారని టీఆర్ఎస్ పై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రజల్లోకి వెళ్లి టీఆర్ఎస్ గూండాల అరాచకాలను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు బండి సంజయ్ సూచించారు. ఇక అర్వింద్ ఇంటి పై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. బీజేపీ నిరసనలతో అప్రమత్తమైన పోలీసులు టీఆర్ఎస్ నేతల ఇళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.