కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన బండి సంజయ్

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన బండి సంజయ్

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం మెట్ పల్లి మండలంలోని ఆరపేట గ్రామంలోకి బండి పాదయాత్ర ప్రవేశించింది. ఆయనకు స్థానిక బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని 'అమరవీరుల స్థూపం' వద్ద ఆయన పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు.గ్రామంలో 'మహాత్మా గాంధీ', 'డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్'ల విగ్రహాలకు పూలమాలవేసి, నివాళి అర్పించారు. 

అక్కడి నుంచి స్థానిక బీజేపీ కార్యకర్త స్వర్గీయ నారాయణరెడ్డి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ వెంకటరమణారెడ్డి (దాము) ఇంటికి వెళ్లి ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. భారతీయ జనతా పార్టీ బలోపేతానికి వీరు చేసిన సేవలు మరువలేనివని అన్నారు.