ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మన దేశంలో అయితే మహమ్మారి సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చింది. ఇలాంటి సమయంలో కరోనా వైరస్ను చంపేందుకు అన్ని రకాల రీసెర్చ్లను సైంటిస్టులు చేస్తున్నారు. ఇప్పటికే పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా బంగ్లాదేశ్సైంటిస్టులు ఒక నాసల్ స్ప్రేని డెవలప్ చేశారు. ఈ స్ప్రేని పీల్చితే కరోనా ఖతం అయిపోతుందని వారు చెబుతున్నారు. కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం బంగ్లాదేశ్ రిఫరెన్స్ ఇనిస్టిట్యూట్ ఫర్ కెమికల్ మెజర్మెంట్స్(బీఆర్ఐసీఎం)ని ఏర్పాటు చేసింది. బీఆర్ఐసీఎం సైంటిస్టులు తాజాగా బంగాసేఫ్ ఓరో నాసల్ స్ప్రేని డెవలప్ చేశారు. ముక్కు, నోరు, కళ్ల ద్వారా వ్యాపిస్తున్న వైరస్ను అడ్డుకోగలదని చెబుతున్నారు. త్వరలోనే కరోనాను అంతం చేసే సామర్థ్యం కలిగిన నాసల్ స్ప్రేని ప్రవేశపెడతామని బీఆర్ఐసీఎం డైరెక్టర్ జనరల్ డాక్టర్ మలా ఖాన్ చెప్పారు. క్లినికల్ ట్రయల్స్ కోసం బంగ్లాదేశ్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ నుంచి మార్చి 24న అనుమతి వచ్చిందని, త్వరలోనే ట్రయల్స్ పూర్తవుతాయని ఆమె చెప్పారు. సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకునే ఈ నాసల్ స్ప్రేని తయారు చేశామని, దాని ధర అందరికీ అందుబాటులో ఉంటుందని, ప్రొడక్షన్ కాస్ట్ ను బట్టి స్ప్రే రేటును నిర్ణయిస్తామని చెప్పారు. కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్లు త్వరగా కోలుకోవడానికి కూడా ఈ స్ప్రే ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. త్వరలోనే ఇది మార్కెట్లోకి వస్తుందన్నారు.
