SL vs BAN: చివరి ఇన్నింగ్స్ ఆడిన లంక దిగ్గజం.. మాథ్యూస్‌కు బంగ్లా క్రికెటర్లు గౌరవం

SL vs BAN: చివరి ఇన్నింగ్స్ ఆడిన లంక దిగ్గజం.. మాథ్యూస్‌కు బంగ్లా క్రికెటర్లు గౌరవం

శ్రీలంక దిగ్గజ ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ తన టెస్ట్ కెరీర్ ను ముగించాడు. మంగళవారం (జూన్ 17) గాలే వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభమైంది. ఈ టెస్ట్ మ్యాచ్ లో మాథ్యూస్ తన చివరి టెస్ట్ ఇన్నింగ్స్ ఆడేశాడు. తొలి ఇన్నింగ్స్ లో 39 పరుగులు చేసి అనాముల్ హక్ బౌలింగ్ లో ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో మాథ్యూస్ బ్యాటింగ్ కు దిగే అవకాశం రాకపోవచ్చు. టెస్ట్ మూడో రోజు ఆటలో భాగంగా ప్రస్తుతం శ్రీలంక బ్యాటింగ్ చేస్తుంది. మరి కాసేపట్లో మూడో రోజు ఆట ముగుస్తుండగా.. ప్రస్తుతం శ్రీలంక 88 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది.

ఈ టెస్ట్ మ్యాచ్ లో మరో రెండు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మాథ్యూస్ బ్యాటింగ్ కు రావాలంటే నాలుగో రోజు శ్రీలంక మిగిలిన ఆరు వికెట్లను కోల్పోవడంతో పాటు బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో ఆలౌట్ అవ్వాలి. ఆ తర్వాత శ్రీలంక రెండు వికెట్లు కోల్పోవాలి. దీంతో  మాథ్యూస్ సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసే అవకాశాలు దాదాపుగా లేనట్టే. మాథ్యూస్ ఔటైన వెంటనే బంగ్లాదేశ్ క్రికెటర్లు తమ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు. ఈ లంక దిగ్గజం ఔటై వెళ్తున్న సమయంలో బంగ్లా ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ హానర్ తో సత్కరించారు.

Also Read :  కోహ్లీ, రోహిత్‌లు లేకపోతేనే మంచిది

ఈ మ్యాచ్ విషయానికి వస్తే శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌లో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ భారీ స్కోరు చేసింది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ నజ్ముల్‌‌‌‌‌‌‌‌ శాంటో (148), ముష్ఫికర్‌‌‌‌‌‌‌‌ రహీమ్‌‌‌‌‌‌‌‌ (163) సెంచరీలకు తోడు లిటన్‌‌‌‌‌‌‌‌ దాస్‌‌‌‌‌‌‌‌ (90) రాణించడంతో.. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 495 పరుగులకు ఆలౌట అయింది. 292/3 ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన బంగ్లా మరో 15 పరుగులు జోడించి తమ చివరి వికెట్ కోల్పోయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రస్తుతం శ్రీలంక 88 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. ఓపెనర్ పాతుం నిస్సాంక 187 పరుగులు చేసి డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.