ఖైరతాబాద్, వెలుగు: భూ కబ్జాలకు పాల్పడుతున్నాడంటూ ఓ బాధితుడు ఇచ్చిన కంప్లయింట్తో సినీ నిర్మాత సి. కళ్యాణ్, అతడి అనుచరులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. తిరుమలగిరికి చెందిన మిట్ట స్వరూప్ 1989లో షేక్పేట గ్రామ పరిధిలోని ఫిల్మ్నగర్ కో – ఆపరేటివ్ సొసైటీలో 634 గజాల స్థలం కొన్నాడు. ప్రస్తుతం అతడు అమెరికాలో ఉంటుండంతో తన తమ్ముడు మిట్ట విద్యాసాగర్కు జీపీ చేశాడు. మంగళవారం ఉదయం ముగ్గురు వ్యక్తులు వెళ్లి ఈ స్థలం సినీ నిర్మాత సి. కళ్యాణ్కు చెందినదంటూ గేట్లకు తాళాలు వేశారు. దీంతో విద్యాసాగర్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. సి. కళ్యాణ్తో పాటు మిగతా ముగ్గురిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు.