నిర్మాత సి.కళ్యాణ్​పై బంజారహిల్స్ లో  కేసు

నిర్మాత సి.కళ్యాణ్​పై బంజారహిల్స్ లో  కేసు

ఖైరతాబాద్​, వెలుగు: భూ కబ్జాలకు పాల్పడుతున్నాడంటూ ఓ బాధితుడు ఇచ్చిన కంప్లయింట్​తో సినీ నిర్మాత సి. కళ్యాణ్, అతడి అనుచరులపై బంజారాహిల్స్​ పోలీసులు కేసు ఫైల్ చేశారు. తిరుమలగిరికి చెందిన మిట్ట స్వరూప్​ 1989లో షేక్​పేట గ్రామ పరిధిలోని  ఫిల్మ్​నగర్ కో – ఆపరేటివ్ ​సొసైటీలో 634 గజాల స్థలం కొన్నాడు. ప్రస్తుతం అతడు అమెరికాలో ఉంటుండంతో తన తమ్ముడు మిట్ట విద్యాసాగర్​కు జీపీ చేశాడు.  మంగళవారం ఉదయం ముగ్గురు వ్యక్తులు వెళ్లి ఈ స్థలం సినీ నిర్మాత సి. కళ్యాణ్​కు చెందినదంటూ గేట్లకు తాళాలు వేశారు. దీంతో విద్యాసాగర్  పోలీసులకు కంప్లయింట్ చేశాడు. సి. కళ్యాణ్​తో పాటు మిగతా ముగ్గురిపై పోలీసులు కేసు  ఫైల్ చేశారు.