జీడిమెట్ల, వెలుగు: అనారోగ్య సమస్యలకు తోడు పెళ్లి కావడం లేదన్న దిగులుతో ఓ యువతి సూసైడ్ చేసుకుంది. సిద్ధిపేట జిల్లా మద్దూర్ మండలం రేబర్తి గ్రామానికి చెందిన కుంటి నిరోష(32) సికింద్రాబాద్లోని HDFC బ్యాంక్లో ఉద్యోగం చేస్తోంది. చింతల్ పద్మానగర్లో తన సోదరుడు నరేశ్తో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.
ఆమెకు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీనికి తోడు వివాహం జరగడం లేదు. దీంతో మనస్తాపానికి గురైన నిరోష గురువారం సాయంత్రం ఇంట్లో ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
