టూరిస్ట్ ప్లేస్గా లక్నాపూర్ అభివృద్ధి: పరిగి ఎమ్మెల్యే టి.రాంమ్మోహన్రెడ్డి

టూరిస్ట్ ప్లేస్గా లక్నాపూర్ అభివృద్ధి: పరిగి ఎమ్మెల్యే టి.రాంమ్మోహన్రెడ్డి

పరిగి, వెలుగు: లక్నాపూర్ ప్రాజెక్ట్​ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని పరిగి ఎమ్మెల్యే టి.రాంమ్మోహన్​రెడ్డి అన్నారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో డ్వాక్రా మహిళా సంఘాలకు తన సతీమణి ఉమారెడ్డితో కలిసి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.

వికారాబాద్​ జిల్లాలో రెండో అతిపెద్ద ప్రాజెక్ట్​గా పేరొందిన లక్నాపూర్​ ను అంచెలంచెలుగా డెవలప్​ చేస్తామన్నారు. ఇందిరమ్మ జయంతిని పురస్కరించుకుని  చీరల పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన లక్నాపూర్​ ప్రాజెక్టులో బోటింగ్​ చేశారు. కార్యక్రమంలో పరిగి మార్కెట్​ కమిటీ చైర్మన్​ పరుశురాంరెడ్డి, వైస్​ చెర్మన్​ అయూబ్​ పాల్గొన్నారు.