బీఓబీ లాభం 168 శాతం జంప్

బీఓబీ లాభం 168 శాతం జంప్

ముంబై : బ్యాంక్​ ఆఫ్​ బరోడా (బీఓబీ) లాభం క్యూ 4 లో 168 శాతం జంప్​ చేసింది. 2022–23 నాలుగో క్వార్టర్లో బ్యాంకు లాభం రూ. 4,775 కోట్లకు చేరింది. లోన్​లాసెస్ కేటాయింపులు తగ్గడం వల్లే లాభం పెరిగింది. ఇక 2022–23 పూర్తి ఫైనాన్షియల్​ ఇయర్​కి బీఓబీ లాభం రెట్టింపయి రూ. 14,110 కోట్లకు చేరింది. మార్చి 2023 క్వార్టర్లో బ్యాంకు నెట్​ ఇంట్రస్ట్​ ఇన్​కం 33.8 శాతం ఎగసి రూ. 11,525 కోట్లయింది. బ్యాంకు ఇచ్చిన అప్పులు ఈ క్వార్టర్లో 19 శాతం గ్రోత్​ రికార్డు చేశాయి. నెట్​ఇంట్రస్ట్​​ మార్జిన్​ 3.53 శాతానికి పెరగడం తనకే ఆశ్చర్యం కలిగించిందని చెబుతూ, ఈ ఫైనాన్షియల్​ ఇయర్లోనూ ఈ లెవెల్​ కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తామని బీఓబీ సీఈఓ సంజీవ్​ చద్దా వెల్లడించారు.

ప్రస్తుత ఫైనాన్షియల్​ ఇయర్లో 13 నుంచి 14 శాతం లోన్​ గ్రోత్​ సాధించాలని టార్గెట్​గా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందులో 11 నుంచి 13 శాతం కార్పొరేట్​ లోన్లే ఉంటాయని ఆయన చెప్పారు.  చివరి క్వార్టర్లో బ్యాడ్​ లోన్​ ప్రొవిజన్లు 94 శాతం తగ్గి రూ. 320 కోట్లకే పరిమితమయ్యాయని చద్దా పేర్కొన్నారు. బ్యాంకు గ్రాస్​ ఎన్​పీఏలు మార్చి 2023 నాటికి 3.79 శాతానికి తగ్గాయని, వాలంటరీ ఇన్​సాల్వెన్సీ పిటిషన్​ ఫైల్​ చేసిన గో ఫస్ట్​ ఎయిర్​లైన్స్​కు తమ బ్యాంకు రూ. 1,300 కోట్లు అప్పుగా ఇచ్చిందని చద్దా వెల్లడించారు. ఈ లోన్​లో రూ. 500 కోట్లకు తాజా క్వార్టర్లో ప్రొవిజన్​ చేసినట్లు తెలిపారు.బ్యాంకు గిఫ్ట్​సిటీ బ్రాంచ్​ దూసుకెళ్తోందన్నారు. ఈ బ్రాంచ్​ బిజినెస్​ 5 బిలియన్​ డాలర్లకు చేరిందన్నారు. రాబోయే రెండు, మూడు నెలల్లో క్రెడిట్​ కార్డుల బిజినెస్​,  నైనిటాల్​ బ్యాంకులలో వాటా అమ్మకం ఒక కొలిక్కి వస్తుందని కూడా చెప్పారు.