హైదరాబాద్, వెలుగు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ) స్టేట్, డిస్ట్రిక్ట్ లెవెల్ పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిధులు కేటాయించాలని ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ సంఘం (పెటా టీఎస్) సీఎం రేవంత్ రెడ్డిని కోరింది. పెటా టీఎస్ 2026 డైరీని సీఎం మంగళవారం తన నివాసంలో ఆవిష్కరించారు. రాష్ట్రంలో కొత్తగా1803 పీఈటీ పోస్టులు మంజూరు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా జీవో 74ను సవరించి రిజర్వేషన్లను పెంచాలని ఈ సందర్భంగా సీఎంకు పెటా టీఎస్ స్టేట్ ప్రెసిడెంట్ బి. రాఘవరెడ్డి, సెక్రటరీ పి. కృష్ణమూర్తి గౌడ్ విజ్ఞప్తి చేశారు.
