లోన్ల కోసం ఐఎంజీసీ, బీఓఐ ఒప్పందం

లోన్ల కోసం ఐఎంజీసీ,  బీఓఐ ఒప్పందం

న్యూఢిల్లీ: తనఖా లోన్లు ఇచ్చే మార్ట్​గేజ్​గ్యారంటీ కంపెనీ ఇండియా మార్ట్‌‌గేజ్ గ్యారెంటీ కార్పొరేషన్ (ఐఎంజీసీ ), భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ ఇండియా (బిఓఐ) తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. 

 శాలరీడ్​, సెల్ఫ్​ఎంప్లాయ్​డ్​ ​కస్టమర్లకు హోంలోన్ లోన్లు ఇస్తారు.  భారతదేశం అంతటా 5,100కి పైగా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచుల్లో ఈ ప్రొడక్టులు అందుబాటులో ఉంటాయి. ఐఎంజీసీ  హామీ వల్ల బ్యాంకుకు డిఫాల్ట్‌‌ల ప్రమాదం తగ్గుతుంది. తాము తనఖా గ్యారెంటీ ఇవ్వడం వల్ల లోన్ల సంఖ్య పెరుగుతుందని ఐఎంజీసీ తెలిపింది.