భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు కో-ఆపరేటివ్ బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, క్యాషియర్, అటెండర్ కలిసి బ్యాంకు డబ్బులను తమ అవసరాలకు వాడుకుంటున్నారు. గత రెండేళ్ల నుంచి 2 కోట్ల 91 లక్షలు వాడుకున్నట్లు తేలింది. బ్యాంక్ యాజమాన్యం ఆగస్టు నెలలో చేసిన ఆడిట్లో ఈ విషయం బయటపడింది. బ్యాంకు సీఈవో సాంబమూర్తి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి కోటి 44 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు జిల్లా ఎస్పీ సునీల్ దత్ చెప్పారు.
For More News..