- పార్లమెంట్లో భగవత్ కారద్ వెల్లడి
న్యూఢిల్లీ: కిందటి ఆరు సంవత్సరాలు, ఈ ఫైనాన్షియల్ మొదటి ఆరు నెలల్లో కలిపి మొత్తం రూ. 7.34 లక్షల కోట్ల ఎన్పీఏలను బ్యాంకులు రికవరీ చేశాయని రాజ్యసభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కారద్ వెల్లడించారు. ఇందులో ఫ్రాడ్ కేసులకు సంబంధించినవీ ఉన్నాయని చెప్పారు. ఫ్రాడ్ కేసుల నుంచి రూ. 55,895 కోట్ల రికవరీ జరిగిందని పేర్కొన్నారు. మోసాలపై ఆర్బీఐ 2016లో బ్యాంకులకు కొత్త గైడ్లైన్స్ను జారీ చేసిందని, బ్యాంకులలో మోసాలను అరికట్టేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం కూడా తీసుకుందని మంత్రి చెప్పారు. ఈ చర్యల వల్లే బ్యాంకులలో మోసాలు తగ్గుముఖం పట్టాయని చెబుతూ, 2015–16లో రూ. 68,962 కోట్ల విలువైన బ్యాంకు ఫ్రాడ్స్ నమోదవగా, 2020–21 నాటికి అవి రూ. 11,583 కోట్లకు తగ్గాయని పేర్కొన్నారు. 2021 – 22 ఫైనాన్షియల్ ఇయర్(ఏప్రిల్ – డిసెంబర్)లో బ్యాంక్ ఫ్రాడ్స్ రూ. 648 కోట్లేనని చెప్పారు.
ఏబీజీ షిప్యార్డ్ ఇన్వెస్టిగేషన్కు రాష్ట్రాలు సహకరించట్లే..
ఏబీజీ షిప్యార్డు కేసులో సీబీఐ దర్యాప్తుకు మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించడంలేదని, అందుకే ఆలస్యమవుతోందని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ పార్లమెంట్కు చెప్పారు. ఫ్రాడ్ను గుర్తించిన తర్వాత చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆలస్యం చేయడం లేదని ఆమె వెల్లడించారు.