
- ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
నస్రుల్లాబాద్, వెలుగు : విద్య, వైద్య రంగాల హబ్గా బాన్సువాడను తీర్చిదిద్దుతున్నామని రాష్ర్ట ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామ శివారులో నిర్మిస్తున్న ప్రభుత్వ బీఎస్సీ నర్సింగ్ కళాశాల భవన సముదాయ పనులపై సంబంధిత ఆఫీసర్లు, కాంట్రాక్టర్ తో నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యే మాట్లాడారు.
ప్రభుత్వ బీఎస్సీ నర్సింగ్ కళాశాల భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 40 కోట్లు కేటాయించిందన్నారు. బాలికలకు విద్య ఎంతో అవసరమని, విద్యతోనే సామాజికంగా, ఆర్థికంగా మార్పు వస్తుందన్నారు. సమావేశంలో ఆర్అండ్బీ ఆఫీసర్లు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.