
హైదరాబాద్, వెలుగు: సర్కారు స్కాలర్ షిప్కు అర్హత లేని బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్లకు గత రెండు విద్యాసంవత్సరాలకు సంబంధించిన ఫీజులో 40% మినహాయింపు ఇవ్వాలని సర్కారు నిర్ణయించిందని మంత్రి సబిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా నేపథ్యంలో 2019-20, 2020-21, అకడమిక్ ఇయర్లలో ఫిజికల్ క్లాసులు, హాస్టల్స్ నిర్వహణ లేకపోవడంతో స్టూడెంట్లపై భారం పడొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. స్కాలర్ షిప్తో సంబంధం లేకుండా విద్యార్థులకు.. సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆర్జీయూకేటీ వీసీని మంత్రి ఆదేశించారు.
గెస్ట్ లెక్చరర్లకు 12 నెలల వేతనం వర్తింపచేయాలి
ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో గెస్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్న 1,654 మందికి పీరియడ్ విధానం ఎత్తివేసి కన్సాలిడేటెడ్ గా 12 నెలల వేతనం వర్తింపజేయాలని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నేతలు.. మంత్రి సబితను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం పీరియడ్ కు రూ.390 చొప్పున నెలకు 72 పీరియడ్లకు మించకుండా రూ.28,080 రెమ్యూనరేషన్ ఇస్తున్నారని తెలిపారు. సెలవులు వచ్చినా, సబ్జెక్ట్ పరంగా తక్కువ పీరియడ్స్ ఉన్నా పూర్తి స్థాయి వేతనం పొందలేకపోతున్నామని తెలిపారు. కన్సాలిడేట్ పే గా 12 నెలల వేతనం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.