ఏం సాధించారని.?యాదాద్రిపై కేసీఆర్ చిత్రం చెక్కారు: భట్టి

ఏం సాధించారని.?యాదాద్రిపై కేసీఆర్ చిత్రం చెక్కారు: భట్టి

యాదాద్రి ఆలయ స్థంబాలపై కేసీఆర్, టీఆర్ఎస్ గుర్తులుండటాన్ని తప్పు బట్టారు కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క. ఏం సాధించారని ఆలయాలపై కేసీఆర్ బొమ్మలు చెక్కుతున్నారని అన్నారు. ఇది ప్రజాస్వామ్యమా? రాచరికమా అని ప్రశ్నించారు.తెలంగాణ పోరాటంలో సాయుధుల చిత్రాలను చెక్కాలని సూచించారు. ప్రజల ఆరోగ్యంపై  టీఆర్ ఎస్ ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. విష జ్వరాలు వచ్చి ప్రజలు చనిపోతుంటే మంత్రి ఈటెల  పట్టించుకోవడం లేదన్నారు.