ప్రధానితో భేటీలో బీసీ రిజర్వేషన్ల ప్రస్తావన ఎక్కడ? : జాజుల

 ప్రధానితో భేటీలో బీసీ రిజర్వేషన్ల  ప్రస్తావన ఎక్కడ? : జాజుల
  • సీఎం రేవంత్​కు జాజుల ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీని సీఎం రేవంత్ రెడ్డి కలిసినప్పుడు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన రిజర్వేషన్​బిల్లులను కేంద్రంలో ఎందుకు పెండింగ్​పెట్టారో, ఎప్పుడు క్లియర్​ చేస్తారో ప్రధానిని ఎందుకు అడగలేదని నిలదీశారు. ఈ మేరకు బుధవారం జాజుల పత్రిక ప్రకటన విడుదల చేశారు. 

ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నందున బీసీ రిజర్వేషన్లపై ఒత్తిడి పెంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని శ్రీనివాస్​గౌడ్​గుర్తు చేశారు.  రాహుల్ గాంధీతో జరిగిన భేటీలో కూడా బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించకపోవడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం పార్లమెంటులో పోరాటం చేసేలా  రాహుల్ గాంధీని ఒప్పిస్తే బాగుండేదన్నారు.