
హైదరాబాద్ సిటీ, వెలుగు: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో విద్యుత్షాక్తో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని బీసీ రాజ్యాధికార సమితి ఫౌండర్ దాసు సురేశ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన రామంతాపూర్లో మృతుల కుటుంబాలను పరామర్శించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. విద్యుత్ బోర్డ్ ఇప్పటివరకు స్పందించకపోవడం విచారకరమన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోకపోతే విద్యుత్ సౌధాను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఎమ్మెల్యే బండారి లక్ష్మణ్తో ఫోన్లో మాట్లాడి బాధితులకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామంతాపూర్ పద్మశాలీ సంఘం నాయకులు కొండ కృష్ణమూర్తి, సిరిశాల విజయ ప్రకాశ్, కొంగరి బాలచంద్రయ్య, రాపోలు భిక్షమయ్య, గోపి, రాపోలు శేఖర్ తదితరులుపాల్గొన్నారు.