బెతెస్దా: యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తోపాటు ఆయన సతీమణి మెలానియాకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ట్రీట్మెంట్ కోసం ట్రంప్ దంపతులు వాల్టర్ రీడ్ మిలటరీ మెడికల్ సెంటర్లో చేరారు. అక్కడి నుంచే ట్రంప్ తన విధులు నిర్వహిస్తున్నారు. అయితే ట్రంప్ ఆరోగ్యం క్షీణించిందంటూ పలు పుకార్లు వస్తున్నాయి. ఈ విషయంపై ట్రంప్ స్పష్టత ఇచ్చారు. తాను బాగున్నానని, మరికొద్ది రోజుల్లో పూర్తి ఆరోగ్యంతో తిరిగొస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల క్యాంపెయినింగ్ను కూడా త్వరలో కంప్లీట్ చేస్తానన్నారు. రాబోయే మరికొద్ది రో్జులు అత్యంత కఠినంగా ఉండనున్నాయని, ఆస్పత్రి నుంచి పని చేయడం తప్పిస్తే తనకు మరో్ ప్రత్యామ్నాయం లేదన్నారు. కరోనా వచ్చిందని ఓ గదిలో బందీగా ఉండలేనని, అత్యంత శక్తిమంతమైన దేశానికి అధ్యక్షుడిగా ఏ నేత కూడా అలా చేయరన్నారు. ఈ సమయంలో కూడా అమెరికా సమస్యలను పరిష్కరించడంపైనే పని చేస్తున్నానని పేర్కొన్నారు.
— Donald J. Trump (@realDonaldTrump) October 3, 2020