
కరీంనగర్ జిల్లాలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. గురువారం (అక్టోబర్23) రాత్రి సైదాపూర్మండల కేంద్రంలో ఎలుగుబంటి తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయింది. సైదాపూర్ శివారులోని సమ్మక్క సారలమ్మ జాతర గుట్ట సమీపంలో హుజూరాబాద్, సైదాపూర్ రహదారిపై ఎలుగు బంటి తిరుగుతుండగా చూసిన గ్రామస్తులు భయంతో పరుగులు పెట్టారు. ఎలుగుబంటి సంచారంపై అటవీ శాఖ అధికారులు సమాచారం అందించారు.