నేడు బీటింగ్ రిట్రీట్

నేడు బీటింగ్ రిట్రీట్

నేటితో భారత గణతంత్ర వేడుకలు ముగియనున్నాయి. సాయంత్రం ఐదు గంటలకు విజయ్ చౌక్ లో బీటింగ్ ది రిట్రీట్ వేడుక నిర్వహించనున్నారు. బీటింగ్ ది రిట్రీట్ పరేడ్ వేడుకతో  గణతంత్ర వేడుకలు ముగుస్తాయి. బీటింగ్ ది రిట్రీట్ పరేడ్ లో ప్రధాన ఆకర్షణగా డ్రోన్ షో నిలవనుంది. 75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'గా జరుపుకునే వేడుకలో భాగంగా ఈ సారి డ్రోన్ షో, లేజర్ షో కార్యక్రమాలు నిర్వహించారు. బీటింగ్ ది రిట్రీట్ పరేడ్ లో రాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రి సహా కేంద్రమంత్రులు, ప్రముఖులు పాల్గోనున్నారు. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ , సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ బ్యాండ్‌లు వాయించే ఫుట్-ట్యాపింగ్ సంగీతంతో 26 ప్రదర్శనలు బీటింగ్ ది రిట్రీట్ వేడుకలో ఉండనున్నాయి.