
బాలీవుడ్ సినీ నటి దీపిక పదుకొణె ఇటీవలే ప్రియుడు రణ్ వీర్ సింగ్ ను వివాహం చేసుకుంది. గతేడాది పద్మావత్ వంటి బ్లాక్ బస్టర్ మూవీని చేసిన దీపిక ప్రస్తుతం కూడా చాలా సినిమాలకు కమిట్ అయ్యింది. అయితే పెళ్లి కారణంగా కొన్ని నెలల గ్యాప్ తీసుకుంటున్న ఈ బ్యూటీ త్వరలోనే మళ్లీ కెమెరా ముందుకు రాబోతోంది. తాజాగా ఈమెను మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు తో సత్కరించింది. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన దీపిక… ముంబైలో నివసిస్తున్నందుకు గర్విస్తున్నాను. నా జీవితం ముంబైతో ముడిపడినందుకు ఆనందంగా ఉందని తెలిపింది. రాజకీయాల గురించి మాట్లాడుతూ.. రాజకీయాల గురించి పెద్దగా అవగాహణ అయితే లేదని… రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన కూడా లేదని తెలిపింది. అయితే ఒక వేళ అవకాశం వస్తే మాత్రం తప్పకుండా స్వచ్చభారత్ మంత్రిని అవుతానని చెప్పింది.
స్వచ్చత అంటే చాలా ఇష్టమన్నదీపిక పదుకొణె. చిన్నప్పటి నుండి కూడా పరిసరాలను నీట్ గా ఉంచుకునేందుకు ప్రాముఖ్యత ఇస్తానంది.