- లంకపల్లి అడవుల్లో 30 కిలోల ఐఈడీల నిర్వీర్యం
భద్రాచలం, వెలుగు: చత్తీస్గడ్లో జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. 30 కిలోల రెండు ఐఈడీలను భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ-, చత్తీస్గఢ్ సరిహద్దు ఏరియాలో మావోయిస్టులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో కూంబింగ్కు డీఆర్జీ బలగాలను బస్తర్ఐజీ సుందర్రాజ్ఆదేశించారు.
గురువారం బీజాపూర్జిల్లా పామేడు అడవుల్లో కూంబింగ్చేస్తుండగా భద్రతాబలగాలపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఎదురుదాడికి దిగగా మావోయిస్టులు కాల్పులు జరుపుకుంటూ అడవుల్లోకి పారిపోయారు. ఘటనా స్థలంలో ఇద్దరు మావోయిస్టుల డెడ్ బాడీలను, ఏకే-47, 9ఎంఎం పిస్టోల్, భారీగా పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం, నిత్యావసరాలు లభించాయి.
మావోయిస్టుల కోసం అదనపు బలగాలతో కూంబింగ్కొనసాగి స్తున్నామని బస్తర్ఐజీ సుందర్రాజ్తెలిపారు. ఇదే జిల్లాలోని లంకపల్లి అడవుల్లో కూంబింగ్ చేస్తుండగా భద్రతాబలగాలు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాయి. మావోయిస్టులు అమర్చిన 30 కిలోల బరువైన రెండు ఐఈడీలను గుర్తించి, బాంబు స్క్వాడ్తో నిర్వీర్యం చేశారు.
అదేవిధంగా కాంకేర్జిల్లాలో మావోయిస్టుల కుట్రను భద్రతాబలగాలు భగ్నం చేశాయి. మోదెమర్కా నదీ వెంట మావోయిస్టులు 9 ఐఈడీలను అమర్చారు. గస్తీకి వెళ్లిన భద్రతాబలగాలకు భూమిలో వైర్లు కన్పించాయి. అలర్ట్ అయి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. డీఆర్ జీ, బీఎస్ఎఫ్జవాన్లకు రక్షణగా బాంబ్ డిస్ప్యూజ్స్వ్కాడ్ను పంపించారు.
వరుసగా 9 చోట్ల అమర్చిన ఐఈడీలతో పాటు, వైర్లు గుర్తించి వెలికితీసి నిర్వీర్యం చేశారు. అదే ప్రాంతంలో 2024లో వివిధ ఎన్కౌంటర్లలో 29 మంది మావోయిస్టులను భద్రతాబలగాలు హతమార్చాయి. ప్రతీకారేచ్చతో మావోయిస్టులు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. 25 మందితో కూడిన మావోయిస్టుల దళం సంచరిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తూ గస్తీని ముమ్మరం చేశారు.
