బోనమెత్తిన ఓరుగల్లు

బోనమెత్తిన ఓరుగల్లు

ఖిలా వరంగల్( కరీమాబాద్), వెలుగు: వరంగల్  సిటీలో ఆదివారం బీరన్న స్వామి బోనాలను ఘనంగా  నిర్వహించారు. నగరంలోని దేశాయిపేట, ఉర్సు కరీమాబాద్, రంగశాయిపేట బీరన్నస్వామి బోనాల్లో చీఫ్ గెస్ట్​గా మంత్రి కొండా సురేఖ, గ్రేటర్​ వరంగల్​ మేయర్​ గుండు సుధారాణి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. నగర ప్రజలకు బీరన్న బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అందరిపై బీరన్న ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. కార్పొరేటర్లు కావేటి కవిత, మరుపల్ల రవి, గుండు చందన పూర్ణచందర్  పాల్గొన్నారు.